భారత్‌కు సీఏ 28 లక్షల విరాళం

ABN , First Publish Date - 2021-05-04T09:20:16+05:30 IST

కొవిడ్‌ రెండో వేవ్‌ ఉధృతితో అతలాకుతలమవుతున్న భారత్‌ దేశానికి క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తన వంతు సాయం ప్రకటించి

భారత్‌కు సీఏ 28 లక్షల విరాళం

మెల్‌బోర్న్‌: కొవిడ్‌ రెండో వేవ్‌ ఉధృతితో అతలాకుతలమవుతున్న భారత్‌ దేశానికి క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తన వంతు సాయం ప్రకటించి ఉదారత చాటుకుంది. తక్షణ సాయం కింద భారత్‌కు రూ.28.61 లక్షలు అందించనున్నామని సీఏ సోమవారం వెల్లడించింది. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వాక్సిన్‌ పంపిణీ, ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు తమ దేశ యూనిసెఫ్‌ శాఖతో కలిసి చర్చిస్తున్నట్టు సీఏ ఒక ప్రకటనలో తెలియజేసింది.

Updated Date - 2021-05-04T09:20:16+05:30 IST