ధోనీ కోసమైనా క్రికెట్ త్వరగా మొదలవ్వాలి: సురేశ్ రైనా

ABN , First Publish Date - 2020-06-02T21:28:42+05:30 IST

ఐపీఎల్ కోసం ధోనీ మునుపటికంటే మెరుగ్గా సన్నద్ధమయ్యాడని క్రికెటర్ సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు. 2019 వరల్డ్ కప్...

ధోనీ కోసమైనా క్రికెట్ త్వరగా మొదలవ్వాలి: సురేశ్ రైనా

న్యూఢిల్లీ: ఐపీఎల్ కోసం ధోనీ మునుపటికంటే మెరుగ్గా సన్నద్ధమయ్యాడని క్రికెటర్ సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు. 2019 వరల్డ్ కప్ తర్వాత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైనా ధోనీకి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ కోసం ధోనీ చాలా కష్టపడుతున్నాడని చెప్పాడు. ‘ధోనీతో కలిసి ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఇన్నేళ్లలో ధోనీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం నేను చూడలేదు. మళ్లీ త్వరగా క్రికెట్ ప్రారంభం కావాలని కోరుకుంటున్నా. అప్పుడే ధోనీ ప్రాక్టీస్‌కు ఫలితం దక్కుతుంది. అతడు ఏ స్థాయిలో ప్రాక్టీస్ చేశాడో అందరికీ తెలుస్తుంది’ అని రైనా చెప్పుకొచ్చాడు. దేనినైనా సాధించడానికి మనం శాయశక్తులా కృషి చేసినప్పుడు వారికి అందరి ఆశీస్సులు తప్పక లభిస్తాయని రైనా చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-06-02T21:28:42+05:30 IST