‘అయోధ్య’కు శుభాకాంక్షలు చెప్పినందుకు లైంగికంగా బెదిరిస్తున్నారు: క్రికెటర్ షమి మాజీ భార్య

ABN , First Publish Date - 2020-08-10T23:07:00+05:30 IST

అయోధ్య రామాలయం భూమి పూజ ప్రధాని మోదీ చేతుల మీదుగా బుధవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మతాలకతీతంగా అనేకమంది మద్దతు తెలిపారు. క్రికెటర్ మహమ్మద్ షమి మాజీ భార్య..

‘అయోధ్య’కు శుభాకాంక్షలు చెప్పినందుకు లైంగికంగా బెదిరిస్తున్నారు: క్రికెటర్ షమి మాజీ భార్య

న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం భూమి పూజ ప్రధాని మోదీ చేతుల మీదుగా బుధవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మతాలకతీతంగా అనేకమంది మద్దతు తెలిపారు. క్రికెటర్ మహమ్మద్ షమి మాజీ భార్య హసిన్ జహాన్ కూడా ఆలయ నిర్మాణంపై ఆనంద పడుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే హిందూ ఆలయానికి మద్దతు తెలిపినందుకు కొంత మంది తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, లైంగిక బెదిరింపులకూ పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె కలకత్తా సైబర్‌సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘అయోధ్య భూమి పూజ వేడుకకు శుభాకాంక్షలు చెప్పినప్పటి నుంచి నన్ను కొందరు బెదిరిస్తున్నారు. లైంగిక బెదిరింపులకు పాల్పడటమే కాకుండా చంపేస్తామని భయపెడుతున్నారు. దీని వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానం’టూ హసిన్ జహాన్ తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. వెంటనే నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.





Updated Date - 2020-08-10T23:07:00+05:30 IST