ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
ABN , First Publish Date - 2021-05-08T06:38:18+05:30 IST
ఏటీఎంలో చోరీకి ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. బంజారాహిల్స్లోగల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంకు గురువారం సాయంత్రం ఓ వ్యక్తి వెళ్లాడు.
బంజారాహిల్స్, మే 7 (ఆంధ్రజ్యోతి): ఏటీఎంలో చోరీకి ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. బంజారాహిల్స్లోగల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంకు గురువారం సాయంత్రం ఓ వ్యక్తి వెళ్లాడు. డబ్బు పెట్టే బాక్స్ను తెరిచేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో వెళ్లిపోయాడు. మరుసటి రోజు గమనించిన భద్రతా సిబ్బంది బ్యాంక్ అధికారులకు తెలియజేశారు. అధికారులు సీసీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడు చోరీ చేసేందుకు ప్రయత్నించినట్టు నిర్ధారణ అయింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.