సెల్‌ఫోన్‌ చూడొద్దన్నందుకు బాలుడి బలవన్మరణం

ABN , First Publish Date - 2020-12-01T05:35:44+05:30 IST

సెల్‌ఫోన్‌ ఎక్కువగా చూడొద్దంటూ తల్లి సున్నితంగా మందలించడంతో ఓ బాలుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని లేమల్లెపాడులో చోటు చేసుకుంది.

సెల్‌ఫోన్‌ చూడొద్దన్నందుకు  బాలుడి బలవన్మరణం

వట్టిచెరుకూరు, నవంబరు 30: సెల్‌ఫోన్‌ ఎక్కువగా చూడొద్దంటూ తల్లి సున్నితంగా మందలించడంతో ఓ బాలుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని లేమల్లెపాడులో చోటు చేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం బీసీ కాలనీకి చెందిన రెడ్డి పురందేశ్వర్‌(15) వట్టిచెరుకూరు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌ ఎక్కువగా చూస్తుండడంతో ఆదివారం తల్లి శివ సున్నితంగా మందలించి పొలం పనులకు వెళ్లింది. కొద్దిసేపటికి అమ్మా.. నేను గడ్డిమందు తాగాను అంటూ తల్లికి ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే అతనిని జీజీహెచ్‌కి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు వట్టిచెరుకూరు రైటర్‌ మల్లేశ్వరరావు వెల్లడించారు.

Updated Date - 2020-12-01T05:35:44+05:30 IST