ప్రాణం తీసిన బైక్‌ సరదా

ABN , First Publish Date - 2020-12-05T04:41:50+05:30 IST

బైక్‌ నడపాలన్న సరదా బాలుడి ప్రాణం తీసింది.

ప్రాణం తీసిన బైక్‌ సరదా
మృతి చెందిన సామేలు

- ముగ్గురిని ఎక్కించుకొని బండి నడిపిన మైనర్‌

- ఎద్దుల బండిని ఢీకొని దుర్మరణం

- మరొకరి పరిస్థితి విషమం


రాజోలి, డిసెంబరు 4 : బైక్‌ నడపాలన్న సరదా బాలుడి ప్రాణం తీసింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జోగు ళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పిట్టలబావి సమీపంలో గు రువారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ కథనం మేరకు వివరా లిలా ఉన్నాయి. 

మండలంలోని తూర్పు గార్లపాడుకు చెందిన పెద్ద రాజు కుమారుడు సామేలు (15) గురువారం సాయంత్రం ముగ్గురు స్నేహితు లతో కలిసి ఫాస్ట్‌ఫుడ్‌ తినేందుకు ఒకే బైక్‌పై బుడమర్సుకు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి ఎనిమిది గంటల సమయంలో గ్రామానికి తిరి గి వస్తుండగా పిట్టల బావి వద్ద ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని ఢీకొన్నారు. ప్రమాదంలో నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కర్నూల్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సామేలు (15) మృతి చెందాడు. మిగతా ముగ్గురు ఆదే ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్‌ఐ తెలిపా రు. సామేలు తాత దేవదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-12-05T04:41:50+05:30 IST