ద్విచక్రవాహనాలు ఢీ.. వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-05T05:42:15+05:30 IST
ఎదురుదెరు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతిచెందాడు. చిలకలూరిపేట మండలంలోని కుక్కపల్లివారిపాలెం వద్ద ఈ సంఘటన జరిగింది.
చిలకలూరిపేట, డిసెంబరు 4 : ఎదురుదెరు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతిచెందాడు. చిలకలూరిపేట మండలంలోని కుక్కపల్లివారిపాలెం వద్ద ఈ సంఘటన జరిగింది. చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం యడ్లపాడు మండలం జాలాదికి చెందిన పి.శ్రీనివాసరావు(52) చౌత్రాసెంటర్ శివాలయంలో స్వీపర్గా పనిచేస్తున్న తన భార్యను ఇంటికి తీసుకెళ్లేందుకు గురువారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. జాలాది వైపు వెళుతున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని చిలకలూరిపేటలోని ఓ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్ తెలిపారు.