కొడుకును చంపి.. తల్లి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-04-05T09:22:21+05:30 IST

ఆస్తి కోసం తండ్రిని, కక్షతో బామ్మర్దిని, భార్య తాతనూ హతమార్చాడు. చివరకు భార్యను, కన్నబిడ్డలనూ హత్య చేసేందుకు పలు మార్లు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో మనవరాళ్ల ప్రాణాలు కాపాడేందుకు కన్న కొడుకునే

కొడుకును చంపి.. తల్లి ఆత్మహత్య

  • మనవరాళ్ల ప్రాణాలు కాపాడేందుకే!
  • నెల్లూరు జిల్లా గంగవరంలో ఘటన


కోవూరు, ఏప్రిల్‌ 4: ఆస్తి కోసం తండ్రిని, కక్షతో బామ్మర్దిని, భార్య తాతనూ హతమార్చాడు. చివరకు భార్యను, కన్నబిడ్డలనూ హత్య చేసేందుకు పలు మార్లు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో మనవరాళ్ల ప్రాణాలు కాపాడేందుకు కన్న కొడుకునే హతమార్చిందా తల్లి. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..   గ్రామానికి చెందిన వేమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అనసూయమ్మల కొడుకు గోపాల్‌రెడ్డికి ముగ్గురు కూతుళ్లు. భార్యను నిత్యం  వేధిస్తుండడంతో పిల్లలను తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తడంతో భార్య తమ్ముడిని హత్య చేసి జైలుకెళ్లాడు. విడుదలైన తరువాత ఆస్తి కోసం తండ్రినే హతమార్చాడు.  కొన్నాళ్లకు భార్య తాత శ్రీనివాసులురెడ్డిని కూడా విషమిచ్చి  హత్య చేశాడు. నెల్లూరులోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న భార్య, కూతుళ్లను కూడా హత్యచేసేందుకు పలుమార్లు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలోనే శ్రీరామనవమి రోజు (ఈనెల 2న) ఇద్దరు కూతుళ్లను గోపాల్‌రెడ్డి తన ఇంటికి పిలిపించాడు. వారిని హతమార్చేందుకే పిలిపించాడని అనుమానించిన అనసూయమ్మ గోపాల్‌రెడ్డికి శీతలపానీయంలో పొటాషియం సైనైడ్‌ కలిపి ఇచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకుంది.  శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో విషయం పోలీసులకు తెలిసింది.

Updated Date - 2020-04-05T09:22:21+05:30 IST