నేర సమాచారం
ABN , First Publish Date - 2020-12-01T06:37:25+05:30 IST
గోరంట్ల మండలంలోని గోపిదేవరపల్లి అటవీ ప్రాంతంలో తలారి అనిల్కుమార్ (25) అనే యువకుడు కుటుంబ స మస్యల కారణంగా ఆత్మహత్యకు పా ల్పడినట్లు సీఐ జయనాయక్ తెలి పారు.
కుటుంబ సమస్యలతో యువకుడి ఆత్మహత్య
గోరంట్ల, నవంబరు 30 : మండలంలోని గోపిదేవరపల్లి అటవీ ప్రాంతంలో తలారి అనిల్కుమార్ (25) అనే యువకుడు కుటుంబ స మస్యల కారణంగా ఆత్మహత్యకు పా ల్పడినట్లు సీఐ జయనాయక్ తెలి పారు. సీఐ తెలిపిన మేరకు... గోరంట్ల మండలం భూగానిపల్లికి చెందిన అని ల్కుమార్ భార్య ప్రసన్న, నాలుగేళ్ల చిన్నారి దయానితో కలిసి కొంతకాలం గా హైదరాబాద్లోని వికారాబాద్లో ఉంటున్నారు. చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో కొన్ని రోజుల క్రితం గోరంట్లకు వచ్చి నాలుగో వార్డులో నివాసముంటున్నారు. హైదరాబాద్ నుంచి రావడం ఇష్టపడని భార్య తరచూ భ ర్తతో గొడవపడేది. దీంతో మనస్థాపం చెందిన అనిల్కుమార్ ఆదివారం సాయం త్రం ఇంటి నుంచి ద్విచక్రవా హనంపై వెళ్లిపోయాడు. అయితే అటవీప్రాంతంలోని చింతచెట్టుకు వెంట తెచ్చు కున్న తాడుతో ఉరివేసుకుని ఉండడాన్ని గ్రామస్థులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలోనే ద్విచక్రవాహనం ఆపి ఉంది. పోలీసులు శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
============================================================
బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టరు
.. నలుగురికి గాయాలు
పరిగి(హిందూపురం టౌన్), నవంబరు 30 : వ్యవసాయ పొలంలో ఉన్న పాడుబడిన బావిలోకి ట్రాక్టర్ దూసుకెళ్లి పడటంతో నలుగురికి గాయాల య్యాయి. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మే రకు... లేపాక్షి మండలం బసవనపల్లికి చెందిన శివ ప్రసాద్, సాయిచరణ్, డ్రైవర్ కిష్టప్ప, గంగప్ప మొ క్కజొన్న సొప్పకోసం పరిగి మండలంలోని సుబ్బరా యనపల్లి వద్దకు వెళ్లారు. అక్కడ వ్యవసాయ పొలం లో మొక్కజొన్న సొప్ప వేసుకోవడానికి వెళ్తున్నారు. ఆ దారిలో పాడుబడిన ఓ పాత బావి ఉంది. అయితే చెట్లు ఉండటంతో డ్రైవర్ బాడిని గమనించక ముం దుకెళ్లాడు. దీంతో ట్రాక్టరు బావిలో పడిపోయింది. స్థానికులు గుర్తించి బావివద్దకు చేరుకుని 108కి సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని బయ టకు తీసి వారిని 108లో హిందూపురం ఆసుపత్రికి తరలించారు. వీరిలో శివప్రసాద్, సాయిచరణ్కు తీవ్రగాయాలుకాగా డ్రైవర్ కిష్టప్ప, గంగాధర్కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
=============================================================
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
కళ్యాణదుర్గం టౌన్, నవంబరు 30: పట్టణంలోని జయనగర్ కాలనీలో నివాసముంటున్న అంగన్వాడీ టీచర్ త్రివేణి (41) సోమవారం ఉరివేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి చెందిన కురుబ త్రివేణి అంగన్వాడీ టీచర్గా అదే గ్రామంలో పనిచేస్తోంది. కళ్యాణదుర్గం నుంచి దుద్దేకుంటకు ఉద్యోగ రీత్యా వెళ్లివస్తుండేది. ఇటీవల కొడుకు మృతితో మానసికంగా కుంగిపోయింది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో కొక్కేనికి చీరతో ఉరివేసుకుంది. మృతురాలికి భర్త నరసింహులు, కుమార్తె సౌభాగ్యలక్ష్మీ ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.