పెద్దమ్మ కొడుకును చంపిన తమ్ముడు

ABN , First Publish Date - 2020-12-25T12:02:45+05:30 IST

పెద్దమ్మ కొడుకు (అన్న)ని తమ్ముడు హత్య చేసిన

పెద్దమ్మ కొడుకును చంపిన తమ్ముడు

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌ : కుటుంబ కలహాలు, పాతకక్షల నేపథ్యంలో పెద్దమ్మ కొడుకు (అన్న)ని తమ్ముడు హత్య చేసిన ఘటన గురువారం కుల్సుంపుర పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. జియాగూడ సబ్జీమండీకి చెందిన మహ్మద్‌ ఆజం(32) ఆటో డెంటింగ్‌ వర్క్‌ చేస్తుంటాడు.  ఇటీవల కాలంలో అదే ప్రాంతానికి చెందిన తన చిన్నమ్మ కుమారుడు మహ్మద్‌ అక్బర్‌ (31)తో తరుచూ గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో మహ్మద్‌ అక్బర్‌ తన ఇద్దరు స్నేహితులతో కలిసి పథకం వేశాడు. ఆ ప్రకారం బుధవారం రాత్రి 11గంటల ప్రాంతంలో అన్న మహ్మద్‌ ఆజంకు ఫోన్‌చేసి కేసరి హనుమాన్‌ దేవాలయం సమీపంలోఉన్న మూసీనది ఒడ్డుకు రావాలని పిలిచారు. 


ఆజం 11.30గంటలకు అక్కడికి చేరుకున్నాడు. అక్బర్‌ అతని ఇద్దరు స్నేహితులను ఆజంకు పరిచయం చేశాడు. అనంతరం అందరూ కలిసి మద్యం తాగారు. అర్థరాత్రి 1గంట 30నిమిషాలకుతర్వాత మహ్మద్‌ అక్బర్‌ తన మనసులోఉన్న పాత కక్షలను బయట పెట్టి ఆజంతో గొడవకు దిగాడు. పరస్పరం మాటలు పెరిగి దూషించుకున్నారు. ఇదే అదునుగా భావించిన మహ్మద్‌ అక్బర్‌ ఆవేశంతో  బీరుబాటిల్‌తో ఆజం గొంతులో గుచ్చి హత్య చేశాడు. ముగ్గురూ కలిసి ఆజం మొఖంపై రాయిని పడేసి చనిపోయాడని నిర్ధారించుకున్నాక  నేరుగా కుల్సుంపుర పీఎ్‌సకు వెళ్లి లొంగిపోయారు. ముగ్గురిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-12-25T12:02:45+05:30 IST