నటి కంగన రనౌత్పై క్రిమినల్ కేసు నమోదు
ABN , First Publish Date - 2020-09-27T00:26:29+05:30 IST
నటి కంగనా రనౌత్ పై కర్నాటకలో క్రిమినల్ కేసు నమోదైంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న
బెంగళూరు : నటి కంగనా రనౌత్ పై కర్నాటకలో క్రిమినల్ కేసు నమోదైంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులను ‘తీవ్రవాదుల’ంటూ మండిపడటంతో తూమ్కూరు లోని జేఎంఎఫ్సీ కోర్టులో ఈ కేసు నమోదైంది. ట్విట్టర్ వేదికగా కంగనా ఈ వ్యాఖ్య చేయడంతో ఐపీసీ 44,108,153,153ఏ, 504 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
‘‘ఎవరైనా నిద్రిస్తే వారిని తట్టి లేపొచ్చు. ఎవరికైనా అర్థం కాకపోతే... వారికి అర్థం చేయించవచ్చు. కానీ... నిద్ర పోతున్నట్లు నటించేవారిని, అర్థం కానట్లు నటించేవారిని ఏం చేయాలి? వీరూ తీవ్రవాదుల లాంటివారే. సీఏఏ కారణంగా ఒక్కరు కూడా పౌరసత్వం కోల్పోలేదు. కానీ వారు రక్తం చిందించారు.’’ అంటూ కంగనా రనౌత్ ట్వీట్ చేశారు.