‘నేరగాడికీ వాదించుకొనే అవకాశమివ్వాలి’
ABN , First Publish Date - 2021-08-02T07:12:38+05:30 IST
నేరస్థుడికి సైతం కోర్టులో తన వాదనను వినిపించుకొనేందుకు అవకాశాలివ్వాలని, ఇది సక్రమ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ అన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 1: నేరస్థుడికి సైతం కోర్టులో తన వాదనను వినిపించుకొనేందుకు అవకాశాలివ్వాలని, ఇది సక్రమ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ అన్నారు. నిందితులకు ఉచిత న్యాయసాయం అందించడానికి సంబంధించి ప్రతి పోలీసు స్టేషన్లో బోర్డులు పెట్టాలని ఆయన సూచించారు.