నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి
ABN , First Publish Date - 2022-07-09T06:10:55+05:30 IST
ప్రతీ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా పోలీసు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసులు, బక్రిద్, బోనాల పండుగలపై నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సిరిసిల్ల క్రైం, జూలై 8: ప్రతీ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా పోలీసు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసులు, బక్రిద్, బోనాల పండుగలపై నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్, బోనాల పండుగలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూగ జీవాల అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. బక్రిద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్, ఇతర అంశాలపై దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. డ్రగ్స్, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఫంక్షనల్ వర్టికల్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసపత్రాలను అందజేశారు. సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారి, రవికుమార్, సీఐలు అనిల్కుమార్, ఉపేందర్, మొగిలి, వెంకటేశ్, బన్సీలాల్, శ్రీలత, నవీన్కుమార్, సర్వర్, లింగమూర్తి, ఆర్ఐలు కుమారస్వామి, రజనీకాంత్, యాదగిరి, ఎస్సైలు పాల్గొన్నారు.
అత్యుత్తమ ప్రతిభకనబరిచిన పోలీసులు వీరే
వెంకటేశ్వర్లు ఎస్సై ముస్తాబాద్, శేఖర్ ఎస్సై ఎల్లారెడ్డిపేట, విజయ్కుమార్ కానిస్టేబుల్ వేములవాడ రూరల్, మోహన్, కానిస్టేబుల్ కోనరావుపేట, దామోదర్ కానిస్టేబుల్ ముస్తాబాద్, యాకుబ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డిపేట, రమేశ్ కానిస్టేబుల్ ఇల్లంతకుంట, కిషన్రావు కానిస్టేబుల్ ఎల్లారెడ్డిపేట, నరేశ్నాయక్ కానిస్టేబుల్ బోయిన్పల్లి, ఖాజా జమాలుద్దీన్ ఏఎస్సై సిరిసిల్ల టౌన్, సంపత్ కానిస్టేబుల్ వేములవాడ టౌన్, మహేందర్ కానిస్టేబుల్ సిరిసిల్ల టౌన్, రాజు కానిస్టేబుల్ ముస్తాబాద్, స్వామి, కానిస్టేబుల్ సిరిసిల్ల టౌన్.