నేరస్థులకు శిక్ష పడేలా చూడాలి

ABN , First Publish Date - 2022-07-29T06:36:07+05:30 IST

నేరస్థులకు శిక్షల శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం డీజీపీ కార్యాలయం నుంచి ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్‌లతో పెండింగ్‌ కేసులు, సైబర్‌ క్రైం, ఫంక్షనల్‌ వర్టికల్స్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

నేరస్థులకు శిక్ష పడేలా చూడాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం, జూలై 28: నేరస్థులకు శిక్షల శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం డీజీపీ కార్యాలయం నుంచి ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్‌లతో పెండింగ్‌ కేసులు, సైబర్‌ క్రైం, ఫంక్షనల్‌ వర్టికల్స్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులోనూ నాణ్యతతో కూడిన విచారణ ఉండాలన్నారు. కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  పెండింగ్‌ కేసుల్లో పురోగతి సాధించిన అధికారులను, వర్టిక్స్‌ అధికారులను డీజీపీ అభినందించారు.   ఎస్పీ రాహుల్‌ హెగ్డే, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్‌, రవికుమార్‌, సీఐలు ఉపేందర్‌, వెంకటేశ్‌, బన్సీలాల్‌, శ్రీలత, నవీన్‌కుమార్‌, సర్వర్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-29T06:36:07+05:30 IST