కష్టం.. నష్టం!

ABN , First Publish Date - 2020-07-17T11:26:21+05:30 IST

వరుణుడు నిండా ముంచేశాడు.. ఆరంభంలోనే అన్నదాత కోలుకోలేని దెబ్బతీశాడు. జిల్లాలో గత ఆరు రోజులుగా..

కష్టం.. నష్టం!

నీట మునిగిన పంట పొలాలు


ఏలూరుసిటీ, జూలై 16 : వరుణుడు నిండా ముంచేశాడు.. ఆరంభంలోనే అన్నదాత కోలుకోలేని దెబ్బతీశాడు. జిల్లాలో గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి చేలు ముంపులోనే ఉన్నాయి.వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో అనిశ్చితి ఏర్పడి నైరుతి రుతుపవనాలు బలప డ్డాయి.దీంతో జిల్లాలో గురువారం కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముంపునకు గురైన వరినారుమళ్ళు చాలా ప్రాం తాల్లో కుళ్లిపో యాయని.. తిరిగి వరినారుమళ్ళు వేసుకోవా లని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవ సాయా ధికారుల నివేదికల ప్రకారం 11, 518 హెక్టార్లలో వరి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాల వల్ల జిల్లాలో రహదారులు  మరింత అధ్వానంగా తయారయ్యాయి.

Updated Date - 2020-07-17T11:26:21+05:30 IST