క్రాప్‌ హాలిడే ప్రకటించి పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-12-09T06:43:20+05:30 IST

ప్రభుత్వం క్రాప్‌ హాలిడే ప్రకటించి ఎకరానికి రూ.25 వేలు పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేక అశోక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

క్రాప్‌ హాలిడే ప్రకటించి పరిహారం ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న అశోక్‌రెడ్డి

రామన్నపేట, డిసెంబరు 8: ప్రభుత్వం  క్రాప్‌ హాలిడే ప్రకటించి ఎకరానికి రూ.25 వేలు పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేక అశోక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. రైతులను యాసంగి పంట వేయవద్దని ప్రభుత్వాలు నిర్బంధిం చడంతో రైతులు భారంగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నా రు. మిల్లర్లు కొర్రీలు పెడుతూ బస్తాకు 3కిలోల తరుగు తీస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. యాసంగికి క్రాప్‌హాలిడే ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్‌, నాయకులు బల్గూరి అంజయ్య  పాల్గోన్నారు.  


 


Updated Date - 2021-12-09T06:43:20+05:30 IST