అకాల వర్షంతో పంటలకు నష్టం

ABN , First Publish Date - 2021-04-14T05:34:04+05:30 IST

అకాల వర్షంతో పంటలకు నష్టం

అకాల వర్షంతో పంటలకు నష్టం
కాటారం మండలం దేవరాంపల్లిలో నేలవాలిన వరి పంట

 కాటారం, ఏప్రిల్‌ 13 : మండలవ్యాప్తంగా సోమవారం రాత్రి గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలి దుమారం, వర్షంతో పలు చోట్ల యాసంగి వరి పంట దెబ్బతింది. దేవరాంపల్లి, రేగులగూడెం, భూడిదపల్లిలో లక్ష్మయ్య, రవి, గట్టయ్య, బాబుజానీ, సాగర్‌, సమ్మయ్య, రాజిరెడ్డి, సంపత్‌, రఘు, బాపుతో పాటు పలువురు రైతులకు చెందిన వరి పంట నేల వాలింది. పలు చోట్ల మామిడి తోటల్లో గాలిదుమారంతో కూడిన వర్షానికి మామిడి కాయలు రాలిపోయా యని రైతులు తెలిపారు. ఇప్పటికే కోసిన వడ్లను కొందరు రైతులు కళ్లాల్లో ఆరబెట్టగా అకాల వర్షంతో తడిసిముద్దయ్యాయి. చాలా చోట్ల  మరి కొద్ది రోజుల్లో కోతకు వచ్చే దశలో అకాల వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట చేతికందే సమ యంలో వానలు కురిస్తే నష్టం వాటిల్లుతుందనిఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-04-14T05:34:04+05:30 IST