రబీ సీజన్లో పంట నమోదు
ABN , First Publish Date - 2021-01-26T05:31:06+05:30 IST
మండల పరిధిలోని ఉప్ప రపల్లె గ్రామ పంచాయతీలో రబీ సీజన్కు సంబందించి ఈ-పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రొద్దుటూరు రూరల్, జనవరి 25: మండల పరిధిలోని ఉప్ప రపల్లె గ్రామ పంచాయతీలో రబీ సీజన్కు సంబందించి ఈ-పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ పరిధిలో రైతులు సాగు చేసిన పంటలకు ఈక్రాప్ ద్వారా విలేజ్ అగ్రికల్చలర్ అసిస్టెంట్ హరీంద్ర సోమవారం నమోదు చేశారు. సచివాలయం పరిధిలో రైతుల కు అవసరమైన ఎరువులు, రసాయన మందులు, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు పొందాలంటే ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని పేర్కొన్నారు. పొలం ఉన్న ప్రతి రైతుకు పంట నమోదు తప్పనిసరిగా ఉండాలన్నారు. పొలంలేనివారు కౌలుకు పంట సాగు చేస్తుంటే కౌలు చేస్తున్న వారి యజమానుల వివరాలు తీసుకొని వచ్చి ఈ-క్రాప్ నమో దు చేయించుకోవాలన్నారు. అగ్రికల్చరల్ అసిస్టెంట్కు తెలి యజేస్తే పంట నమోదు చేస్తారన్నారు.