పశువుల మేతగా పంటలు

ABN , First Publish Date - 2021-05-20T06:05:25+05:30 IST

కరోనా దెబ్బకు కూరగాయలు, పూలకు సరైన ధరలు లేక కోతకోసిన పంటలను రైతులు రోడ్డు పక్కన పడేస్తున్నారు.

పశువుల మేతగా పంటలు
దానమయ్యగారిపల్లె వద్ద పశువులు, మేకలకు వదిలేసిన రైతులు

ధరలు లేక రోడ్డ పక్కన పడేస్తున్న టమోటా, బంతిపూలు


 వి.కోట, మే 19: కరోనా దెబ్బకు కూరగాయలు, పూలకు సరైన ధరలు లేక కోతకోసిన పంటలను రైతులు రోడ్డు పక్కన పడేస్తున్నారు. కొందరైతే తోటలోన్నే వదిలేస్త్తున్నారు. టమోటా పంట బాగా దిగుబడి వచ్చినా వాటిని కోతకోసి మార్కెట్‌కు తరలించినా కిలో రూ. 3 నుండి 5 పలుకుతుండటంతో గిట్టుబాటుకాక, వాటిని కొనే వారు లేక రైతులు  వాటిని రోడ్డు పక్కన పడేస్తున్నారు. వి.కోట మండల పరిధిలో చాలా తోటలను కోతకోయ లేక రైతులు వాటిని పశువులు, మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. ఆళ్ళవారిపల్లె వద్ద బంతిపూలు ఏపుగా పెరిగినా వాటికి గిట్టుబాటు లేక పూలను కోయకుండా అలాగే తోటలో వదిలేశారు. వి.కోట నుంచి రోజూ కూరగాయలు చెన్నై, తిరుచ్చి, మధురై, కోయంబత్తూరు, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. తమిళనాడు, కర్ణాటకలో లాక్‌డౌన్‌, వారాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటంతో కూరగాయల ఎగుమతికి అడ్డుకట్టపడింది. దీంతో ధరలు పతనమై రైతులకు తీవ్ర నష్టాలు, కష్టాలు మిగిల్చింది. 




 



Updated Date - 2021-05-20T06:05:25+05:30 IST