వర్షంతో దెబ్బతిన్న పంటలు

ABN , First Publish Date - 2020-08-15T10:00:39+05:30 IST

ఆత్మకూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలో గత నెలరోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షంతో రైతులకు భారీ నష్టం సంభవించింది. ఆత్మకూరు డివి

వర్షంతో దెబ్బతిన్న పంటలు

ఆత్మకూరు, ఆగస్టు 14: ఆత్మకూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలో గత నెలరోజులుగా అడపాదడపా కురుస్తున్న   వర్షంతో రైతులకు భారీ నష్టం సంభవించింది. ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని పాములపాడు, వెలుగోడు, కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి, మొక్కజొన్న పంటలను విస్తారంగా సాగుచేశారు.


గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీరు చేరి వేలాది ఎకరాల  మొక్కజొన్న, పత్తి పంటలు  కుళ్లిపోతున్నాయి. అలాగే పట్టణంలోని లోతట్టు కాలనీలన్నీ జలమయమయ్యాయి.  పట్టణంలోని రహమత్‌నగర్‌, లక్ష్మీనగర్‌, ఏకలవ్యనగర్‌, గరీబ్‌నగర్‌, ఇందిరానగర్‌, హుసేన్‌సానగర్‌ తదితర కాలనీల్లో వర్షపునీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.   

Updated Date - 2020-08-15T10:00:39+05:30 IST