పైర్లపై పురుగులు ఆశించకుండా చూసుకోవాలి

ABN , First Publish Date - 2021-02-25T05:00:50+05:30 IST

వరి, మిరప, పత్తి, శనగ, ఆముదం పైర్లపై తెగుళ్ళు, పురుగు ఆశించకుండా రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ రామకోటేశ్వరి అన్నారు. మండలంలోని పరకొండపాడులో పొలం బడి కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం

పైర్లపై పురుగులు ఆశించకుండా చూసుకోవాలి
పరకొండపాడులో పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ బృందం

గుడ్లూరు, ఫిబ్రవరి 24 : వరి, మిరప, పత్తి, శనగ, ఆముదం పైర్లపై తెగుళ్ళు, పురుగు ఆశించకుండా రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ రామకోటేశ్వరి అన్నారు. మండలంలోని పరకొండపాడులో పొలం బడి కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా కమిషనర్‌ కార్యాలయం నుంచి జిల్లా భూసంరక్షణ విభాగం డీడీఏ విజయ నిర్మల, కందుకూరు ఏడీఏ శేషగిరి తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం  పైర్లలో సోకిన లద్దెపురుగు ఎదుగుదలను గుర్తించి వాటి నివారణకు తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి రైతులకు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిణి గీతా ప్రకాష్‌, వ్యవసాయ సహాయకురాళ్లు లక్ష్మీ, ప్రియాంక, గ్రామరైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T05:00:50+05:30 IST