అనుమానం వచ్చి ట్యాంక్లో తనిఖీ చేయగా.. కోట్లకు కోట్ల డబ్బుల కట్టలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-01-10T03:30:10+05:30 IST
భోపాల్లో ఓ వ్యాపారవేత్త కోట్లకు కోట్ల డబ్బులు సంపాదించాడు. ఎక్కడ దాచాలో తెలీక.. చివరకు వాటర్ ట్యాంకులో దాచాడు. అసలు ఏం జరిగిందంటే..
కొందరు వివిధ మార్గాల ద్వారా విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ఎక్కడ దాచాలో తెలీక.. నాన తిప్పలు పడుతుంటారు. ఎక్కడ పడితే అక్కడ కట్టలు కట్టల నగదు దాచి దొరికిపోవడం తరచూ చూస్తూ ఉంటాం. భోపాల్లో కూడా ఇలాగే జరిగింది. ఓ వ్యాపారవేత్త కోట్లకు కోట్ల డబ్బులు సంపాదించాడు. ఎక్కడ దాచాలో తెలీక.. చివరకు వాటర్ ట్యాంకులో దాచాడు. అసలు ఏం జరిగిందంటే..
భోపాల్ దామోహ్ జిల్లాలో మధ్యప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త శంకర్ రాయ్ కుటుంబం నివాసం ఉంటోంది. ఈయన అక్రమంగా డబ్బు సంపాదించారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. చివరకి అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్లో బ్యాగులో దాచిన రూ.1కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తడిచిన నోట్లను ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వీడియోలో చూడొచ్చు. అలాగే ఇల్లు మొత్తం తనిఖీ చేసి, రూ.8కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు రూ.5 కోట్ల విలువైన నగలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.