కరోనాలోనూ కిక్కిరిసిన జనం
ABN , First Publish Date - 2021-05-17T04:20:56+05:30 IST
వారాంతపు సంత సందర్భంగా ఆయా గ్రామాల నుంచి వస్తున్న ప్రజలతో ఆత్మకూరు ప్రధాన రహదారులు ఆదివారం కిక్కిరిసిపోయాయి.
ఆత్మకూరు, మే 16: వారాంతపు సంత సందర్భంగా ఆయా గ్రామాల నుంచి వస్తున్న ప్రజలతో ఆత్మకూరు ప్రధాన రహదారులు ఆదివారం కిక్కిరిసిపోయాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కొనేందుకు అవకాశం కల్పించడంతో ఆయా గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భౌతిక దూరం పాటించాలని నిబంధనలతో వ్యాపారాలు కొనసాగించాలని మునిసిపల్ పాలక మండలి పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.