మల్లన్న జాతరలో కిక్కిరిసిన భక్తులు

ABN , First Publish Date - 2022-01-27T06:11:29+05:30 IST

మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం బుధవారం భక్తులతో కిక్కిరిసింది.

మల్లన్న జాతరలో కిక్కిరిసిన భక్తులు
పట్నాలు వేస్తున్న ఒగ్గు పూజారులు

- పట్నాలు, బోనాలు సమర్పణ

ఓదెల, జనవరి 26: మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం బుధవారం భక్తులతో కిక్కిరిసింది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి సాగే వనదేవతల జాతర సందర్భంగా భక్తులు ముందుగా మల్లన్న ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.  ఆలయంలో భక్తులు పట్నాలు, బోనాలు, కోడె మొక్కులను సమర్పించారు. 

Updated Date - 2022-01-27T06:11:29+05:30 IST