రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-01-18T05:43:18+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది.

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
స్వామివారి దర్శనం కోసం బారులుదీరిన భక్తులు

వేములవాడ, జనవరి 17 :  వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం  భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకొని రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కొవిడ్‌ నిబంధనలతో లఘు దర్శనం అమలు చేస్తుండడంతో భక్తులు నందీశ్వరుడి విగ్రహం వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-01-18T05:43:18+05:30 IST