కన్నతండ్రి క్రూరత్వం.. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యతో గొడవ.. ఆ కోపంలో అతను ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..

ABN , First Publish Date - 2021-12-21T17:41:27+05:30 IST

అతను పచ్చి తాగుబోతు.. మద్యానికి బానిస.. ఇంట్లో భార్యను వేధించి ఆమె నుంచి డబ్బులు తీసుకుని తాగేస్తుంటాడు..

కన్నతండ్రి క్రూరత్వం.. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యతో గొడవ.. ఆ కోపంలో అతను ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..

అతను పచ్చి తాగుబోతు.. మద్యానికి బానిస.. ఇంట్లో భార్యను వేధించి ఆమె నుంచి డబ్బులు తీసుకుని తాగేస్తుంటాడు.. సోమవారం కూడా భార్యను డబ్బులు అడిగాడు.. ఆమె ఇవ్వకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు.. మూడు నెలల కొడుకుని నేలకేసి కొట్టాడు.. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు.. భార్య తలపై రాడ్డుతో కొట్టాడు.. ఆమె ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి సమీపంలో ఈ ఘటన జరిగింది. 


భికారీపూర్ గ్రామానికి చెందిన రాజన్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం ఇంటికి వెళ్లి భార్య ప్రీతిని మద్యం కోసం డబ్బులు అడిగాడు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ప్రీతి అతనికి డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రాజన్ మంచం మీద ఉన్న మూడు నెలల బాబును తీసుకుని నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం రాజన్ ఓ రాడ్డు తీసుకుని ప్రీతి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ప్రీతి అరుపులు విన్న చుట్టుపక్కల వారు వారిని ఆస్పత్రికి చేర్చారు. 


ప్రీతి ప్రస్తుతం ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతోంది. తన కొడుకు చనిపోయినట్టు ఆమెకు తెలియదు. సమాచారం అందుకున్న పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో కూడా రాజన్ క్రూరంగా ప్రవర్తించాడు. చంపేస్తానని బెదిరించాడు. చివరకు రాజన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రోజు (మంగళవారం) కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

Updated Date - 2021-12-21T17:41:27+05:30 IST