కరోనాపై సీఎస్‌ వ్యాఖ్యలు బాధ్యతారహితం: సీపీఎం

ABN , First Publish Date - 2021-05-08T08:18:17+05:30 IST

రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుండగా వాస్తవాలను మరుగుపరుస్తూ తగ్గుముఖం పడుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

కరోనాపై సీఎస్‌ వ్యాఖ్యలు బాధ్యతారహితం: సీపీఎం

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుండగా వాస్తవాలను మరుగుపరుస్తూ తగ్గుముఖం పడుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.  బెల్లంపల్లి ఆస్పత్రిలో ఒక్కరాత్రే 12 మంది చనిపోవటం అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసిందని సీఎం కేసీఆర్‌కు  ఆయన శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.   యదార్థాలను కప్పిపుచ్చి కేసులు, చావులు తక్కువ చూపించుకోవటంవల్ల రాష్ర్టానికి తీవ్రనష్టం జరిగిందన్నారు. పార్టీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో  కరోనాపై చర్చించినట్లు తెలిపారు. విస్తృతంగా వైద్యపరీక్షలు చేయాలన్నారు. 

Updated Date - 2021-05-08T08:18:17+05:30 IST