సమర్ధవంతమైన సేవలు అందించేందుకే ఈ-ఆఫీసులు- సీఎస్‌

ABN , First Publish Date - 2020-08-03T21:27:57+05:30 IST

రాష్ట్రముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్ధవంతమైన, ఖచ్చితమైన సేవలు అందించేందుకే ఈ-ఆఫీసులను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

సమర్ధవంతమైన సేవలు అందించేందుకే ఈ-ఆఫీసులు- సీఎస్‌

హైదరాబాద్‌: రాష్ట్రముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్ధవంతమైన, ఖచ్చితమైన సేవలు అందించేందుకే ఈ-ఆఫీసులను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం సెక్రటేరియట్‌లోని 8 శాఖలలో రెండుశాఖల్లో ఈ-ఆఫీసును ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-ఆఫీసు ద్వారా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా , వేగంగా ప్రాసెస్‌ చేయడానికి వీలు కలుగుతుందని అన్నారు. ఎక్కడి నుంచయినా పని చేయడానికి వీలు కలగడంతో పాటు సమర్ధవంతమైన పాలనను అందించ వచ్చన్నారు. 


సెక్రటేరియట్‌లోని వైద్య , ఆరోగ్య, ప్లానింగ్‌,కార్మికశాఖ, బిసి సంక్షేమం, షెడ్యూల్డ్‌కులాల అభివృద్ధిశాఖ, మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, హోంశాఖలతో పాటు పిసిబి, వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయాల్లో ఈ-ఆఫీసు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ సెక్రటేరియట్‌లో 15శాఖల్లో ఈ-ఆఫీసును అమలు చేస్తున్నామని చెప్పారు. మిగిలిన శాఖల్లోనూ వారంలోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో కార్మికశాఖ స్పెషల్‌సీఎస్‌ రాణికుముదిని, ఐటిశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-03T21:27:57+05:30 IST