హరిత హారం పై సీఎస్ సమీక్ష
ABN , First Publish Date - 2021-06-11T21:00:09+05:30 IST
తెలంగాణలో హరితహారం కార్యక్రమం పురోగతి పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణలో హరితహారం కార్యక్రమం పురోగతి పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి హరితహారం కోసం అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈసారి హరితహారంలో మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలు, పల్లె ప్రకృతివనాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అఽధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్చీఫ్సెక్రటరీ శాంతికుమారి, అటవీశాఖ పీసీసీఎఫ్ శోభ, మున్సిపల్శాఖ కార్యదర్శి అరవింద్కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి ప్రియాంక వర్గీస్, పంచాయితీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.