నగరాన్ని వందశాతం వ్యాక్సినేషన్ జరిగిన సిటీగా చేస్తాం: సీఎస్

ABN , First Publish Date - 2021-08-20T01:38:11+05:30 IST

రాబోయే రెండు వారాల్లో హైదరాబాద్ ను వందశాతం కోవిడ్ వాక్సినేషన్ జరిగిన నగరముగా రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

నగరాన్ని వందశాతం వ్యాక్సినేషన్ జరిగిన సిటీగా చేస్తాం: సీఎస్

హైదరాబాద్: రాబోయే రెండు వారాల్లో హైదరాబాద్ ను వందశాతం కోవిడ్ వాక్సినేషన్ జరిగిన నగరముగా రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసి కమిషనర్ గ్రేటర్ పరిధిలో ఉన్న 4 జిల్లాల కలెక్టర్లు, జి హెచ్ ఎం సి జోనల్ కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు, డీఎంహెచ్ఓ లు, ఎస్పిహెచ్వో లతో నిర్వహించిన వర్క్ షాప్ లో మాట్లాడారు. నగరంలోని అన్ని కాలనీలను వందశాతం వాక్సినేషన్ కాలనీలుగా తీర్చిదిద్దేందుకు శాసనసభ్యులు, స్థానిక కార్పొరేటర్ల ను భాగస్వాములను చేయాలన్నారు. అలాగే జీహెచ్ఎంసి, ఆరోగ్యశాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయము తో వ్యవహరించాలని సీఎస్ సూచించారు. ఇంటింటికి తిరిగి సర్వే జరిపి 18 సంవత్సరాల పై బడిన అర్హత కలిగిన వారిని గుర్తించాలన్నారు. ఒక ఉద్యమముగా ఈ కార్యక్రమం చేపట్టాలని సీఎస్ ఆదేశించారు.


మొబైల్ వాక్సినేషన్ కు మంచి స్పందన వస్తున్నట్లు సీఎస్ తెలిపారు. అదే స్ఫూర్తితో ఇంటింటికి తిరిగి మిగిలి పోయిన వ్యక్తులకు వాక్సినేషన్ చేయుటకు వ్యవస్థాపరమైన సిబ్బంది, మెటీరియల్ తో కాలనీల వారీగా టీమ్ లను ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ , జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్,  సంగా రెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంత రావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు, ఓఎస్డి టు సిఎం డా.గంగాధర్,  హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T01:38:11+05:30 IST