రాష్ట్రంలో భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2020-08-15T23:56:10+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆయా జిల్లా కలెక్టర్లతో శనివారం టెలికాన్ఫరెన్స్‌నిర్వహించారు.

రాష్ట్రంలో భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆయా జిల్లా కలెక్టర్లతో శనివారం టెలికాన్ఫరెన్స్‌నిర్వహించారు. ఈసందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఇంకా కొద్దిరోజులు ఇదే పరిస్థితి కొనసాగనున్నందున జిల్లా అధికారులంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలన్నారు. జిల్లాల్లో రైల్వేలైన్‌లకు దగ్గరగా ఉన్నచెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. చెరువులు , కుంటలకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరక ముందే చెరెవు కట్టలను సరంక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24గంటలూ పనిచేసేలా కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేయాలని సూచించారు.


రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌రూం ఏర్పాటు అయ్యిందని ఎవరికైనా ఎలాంటి కష్టం వచ్చినా 040-23450624కాల్‌చేయాలని అన్నారు. జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలని సీఎస్‌ తెలిపారు. అదనంగా గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, పంచాయితీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌సుల్తానియా,డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌బొజ్జ, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యదర్శి రిజ్వీ,ఆర్ధికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌ తదితరులు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T23:56:10+05:30 IST