వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2021-09-03T21:46:13+05:30 IST

వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎస్‌ సోమేష్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యాసంస్థల పునఃప్రారంభంపై సీఎస్‌ సమీక్షించారు.

వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎస్‌ సోమేష్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యాసంస్థల పునఃప్రారంభంపై సీఎస్‌ సమీక్షించారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి టీకాలు పూర్తిచేయాలని ఆదేశించారు. అందరూ టీకాలు వేయించుకున్నట్లు స్కూల్‌ దగ్గర బ్యానర్‌ ఉండాలని, తరగతి గదులను రోజూ శానిటైజేషన్‌ చేయాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించాలని ఆదేశించారు. మధ్యాహ్నం భోజనం విషయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని సోమేష్‌కుమార్ సూచించారు.

Updated Date - 2021-09-03T21:46:13+05:30 IST