గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సీఎస్ వీడియో సమావేశం
ABN , First Publish Date - 2022-01-13T00:41:09+05:30 IST
గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై సచివాలయం నుంచి సీఎస్
అమరావతి: గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై సచివాలయం నుంచి సీఎస్ సమీర్ శర్మ వీడియో సమావేశం నిర్వహించారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘణంగా నిర్వహించేందుకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఈనెల 26వ తేదీన విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకలను నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా శకటాల ప్రదర్శన ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేం శకటాల ప్రదర్శన ఉండాలన్నారు. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన వేదిక, ప్రాంగణంలో ప్రముఖులు, ఇతరులకు అవసరమైన సీటింగ్ ఏర్పాట్లు వంటివి సక్రమంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు.