మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏఎస్పీ పర్యటన

ABN , First Publish Date - 2020-12-05T04:07:40+05:30 IST

పీఎల్‌జీఏ వారోత్సవాలు సందర్భంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలు ఏవిధంగా చేపడుతున్నారో స్వయంగా పరిశీలించేందుకు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్‌నాయుడు శుక్రవారం సీలేరు పోలీస్టేషన్‌ను బైక్‌పై తనిఖీ చేశారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏఎస్పీ పర్యటన
సీలేరు పోలీస్టేషన్‌ను తనిఖీ చేసిన చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్‌నాయుడు.


సీలేరు, డిసెంబరు 4: పీఎల్‌జీఏ వారోత్సవాలు సందర్భంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలు ఏవిధంగా చేపడుతున్నారో స్వయంగా పరిశీలించేందుకు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్‌నాయుడు శుక్రవారం సీలేరు పోలీస్టేషన్‌ను బైక్‌పై తనిఖీ చేశారు. చింతపల్లి నుంచి జీకేవీధి మీదుగా సీలేరు వరకు ద్విచక్ర వాహనంపై ఏఎస్పీ వచ్చారు. స్టేషన్‌లో సెంట్రీలు అప్రమత్తంగా ఉన్నారా.. లేదా..? అని పరిశీలించారు. దుప్పులవాడ పంచాయతీ వలసగెడ్డ కాలనీ, వలసగెడ్డ కొత్తూరు గ్రామాలను సందర్శించి, గిరిజనులతో కొద్దిసేపు మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన వలసగెడ్డ వంతెన వరకు పరిశీలించారు.  ఏఎస్పీ వెంట గూడెంకొత్తవీధి సీఐ మురళీధర్‌ కూడా ఉన్నారు. 

Updated Date - 2020-12-05T04:07:40+05:30 IST