వ్యవసాయానికి సాగు నీరందించాలి
ABN , First Publish Date - 2021-10-24T04:33:17+05:30 IST
రైతులు సాగు చేసిన వ్యవసాయా నికి సాగునీరందించా లని మండల పరిధి లోని సింగాయిపల్లి లో రోడ్డుపై బైఠా యించి ధర్నా చేశా రు.
- రైతుల ధర్నా
కోడేరు, అక్టోబరు 23 : రైతులు సాగు చేసిన వ్యవసాయా నికి సాగునీరందించాలని మండల పరిధిలోని సింగాయిపల్లిలో రోడ్డుపై బైఠా యించి ధర్నా చేశారు. శనివారం ఉదయం సింగాయిపల్లి బస్టాండ్ ఆవరణలో రైతులు ఎండిపోయిన వరిసేనును చూపిస్తూ సాగునీరు వెంటనే ఇవ్వాలని ధర్నా చేశారు. గత నాలుగైదు రోజుల నుంచి కేఎల్ఐ కాల్వల్లో నీరు రావడం లేదని వేసిన పంటలు మొత్తం ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ప్రయాణీకులకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సాగునీరందించి వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం లేకుండా అందించాలన్నారు. బ్రాహ్మచారి, ఈశ్వర్, రమేష్, శ్రీను, కుర్మయ్య, చంద్రయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.