రాత్రి 7 గంటలకే దుకాణాలు బంద్
ABN , First Publish Date - 2021-04-21T05:44:17+05:30 IST
రాత్రి 7 గంటలకే దుకాణాలు బంద్
ములుగు కలెక్టరేట్, ఏప్రిల్ 20: ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కర్ఫ్యూను కచ్చితంగా పాటిస్తామని ములుగు వ్యాపారులు అన్నారు. రాత్రి 7 గంటలకే దుకాణాలు బంద్ చేస్తామ న్నారు. ఈమే రకు ఏఎస్పీ పి.సాయి చైతన్యకు మంగళ వారం లేఖ అందజేశారు. ఏఎస్పీ మాట్లా డుతూ దుకాణాల్లో శానిటైజర్, మాస్కులను అందు బాటులో ఉంచాలన్నారు. వినియోగ దారులు భౌతికదూరం పాటించేలా చొరవ తీసుకో వాలన్నారు. రాత్రి సమయాల్లో ప్రజలు బయ టకు రావొద్దని, అత్యవసర సేవలు యధా విధిగా కొనసాగుతాయని తెలిపారు. ఎవరైనా నిబంధ నలను అతిక్ర మిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామ న్నారు. ఈ కార్యక్ర మంలో ములుగు సీఐ గుంటి శ్రీధర్, ఎస్సైలు హరికృష్ణ, ఫణి పాల్గొన్నారు.
రంజాన్లో నిబంధనలు పాటించాలి
రంజాన్ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని డీఆర్వో కె.రమాదేవి అన్నారు. మంగళవారం ముస్లిం మతపెద్ద లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ని యోజకవర్గానికి 1,500 గిఫ్ట్ ప్యాకెట్లు మం జూరయ్యాయని, త్వరలోనే పంపిణీ చేస్తా మని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ సత్యనారాయణస్వామి పాల్గొన్నారు.