తూ.గో.జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-07-30T16:47:31+05:30 IST

తూ.గో.: జిల్లాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పాజిటీవ్ కేసులు పెరుగుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో...

తూ.గో.జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

తూ.గో.: జిల్లాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పాజిటీవ్ కేసులు పెరుగుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దీంతో చాలా మంది స్వచ్చంధంగా వచ్చి టీకాలు వేయించుకుంటున్నారు. మొదట్లో వ్యాక్సిన్ వేయించుకోడానికి భయపడిన వారు కరోనా కేసులు పెరుగుతుండడంతో టీకాలు వేయించుకుంటున్నారు. అంబాజీపేట మండలంలో, మాచవరం, పుల్లేగుర్రు, దంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామాల్లో కర్ఫ్యూ అమలవుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరవడానికి అనుమతి ఇచ్చారు. 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతోంది. కోనసీమలోని రాజోలు నియోజకవర్గంలో తాటిపాక మఠంలో కర్ఫ్యూ అమలవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 175 కట్టడి ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. కరోనా కేసుల నమోదులో ఈ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.

Updated Date - 2021-07-30T16:47:31+05:30 IST