నె లాఖరు వరకు కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-10-17T05:10:12+05:30 IST

కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు అర్ధరాత్రి 12నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

నె లాఖరు వరకు కర్ఫ్యూ

అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు 


చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 16: కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు అర్ధరాత్రి 12నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు, ఫార్మసిస్ట్‌ తదితర అత్యవసర సేవలందించే సంస్థలు మినహా మిగిలిన అన్ని షాపులు, సంస్థలు, కార్యాలయాలను విధిగా మూసివేయాలని ఆదేశించారు. కర్ఫ్యూ లేని సమయంలో కూడా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఐదుగురికి కంటే ఎక్కువ మంది గుమికూడరాదని స్పష్టం చేశారు. వివాహాలు, మతపరమైన సభలు తదితర సామూహిక కార్యక్రమాలకు గరిష్టంగా 250 మందికి మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. నిబంధనలు ఉల్లఘించే వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 

Updated Date - 2021-10-17T05:10:12+05:30 IST