బకాయిలు చెల్లించకపోతే కరెంట్ కట్!
ABN , First Publish Date - 2021-02-27T09:48:14+05:30 IST
రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంపై విద్యుత్ నియంత్ర ణ మండలి సీరియస్ అయింది.
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంపై విద్యుత్ నియంత్ర ణ మండలి సీరియస్ అయింది. బకాయిలు పడిన సంస్థలకు మరోసారి నోటీసులు పంపాలని, అప్పటికీ చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ అయ్యాయి.