విద్యుదాఘాతంతో కూలీ మృతి

ABN , First Publish Date - 2021-05-18T05:36:23+05:30 IST

విద్యుదాఘాతానికి గురై ఓ కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వి.కొప్పె రపాడులో సోమవారం చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో కూలీ మృతి
ఆంజనేయులు మృతదేహం

బల్లికురవ, మే 17 : విద్యుదాఘాతానికి గురై ఓ కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వి.కొప్పె రపాడులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కలపాల ఆంజనేయులు (32) అదే గ్రామంలోని రవ్వల రామ్మోహనరావుకు చెందిన రొయ్యల చెరువులో నాచు తొలగించేందుకు కూలీగా వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా చేతిలోని కొడవలి విద్యుత్‌ వైరుకు తగిలింది. దీంతో ఆయన విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. అద్దంకి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆంజనేయులుకు భార్య ఇరు వురు పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన వారు బోరున విలపిస్తున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు  ఎస్సై శివనాంచారయ్య తెలిపారు.

Updated Date - 2021-05-18T05:36:23+05:30 IST