జగన్ పాలన నేతన్నలకు శాపం: లోకేశ్
ABN , First Publish Date - 2021-01-17T08:38:04+05:30 IST
జగన్రెడ్డి చెత్త పాలన చేనేత కార్మికుల పాలిట శాపంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జగన్రెడ్డి చెత్త పాలన చేనేత కార్మికుల పాలిట శాపంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కరోనా దెబ్బకి ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, చేనేత కార్మికులకు అండగా నిలిచిన అనేక సంక్షేమ పథకాలు, సబ్సిడీలను వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిందని శనివారం ట్విటర్లో మండిపడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆత్మహత్య చేసుకున్న గోవుల రంగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.