నేడు శిల్పా చౌదరి కస్టడీ పిటిషన్‌పై కోర్టు తీర్పు

ABN , First Publish Date - 2021-12-02T16:09:20+05:30 IST

నేడు శిల్పా చౌదరి కస్టడీ పిటిషన్‌పై రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది. కిట్టి పార్టీల పేరుతో అమాయకులను మోసం చేసి శిల్పా చౌదరి కోట్లు కొల్లగొట్టింది.

నేడు శిల్పా చౌదరి కస్టడీ పిటిషన్‌పై కోర్టు తీర్పు

హైదరాబాద్: నేడు శిల్పా చౌదరి కస్టడీ పిటిషన్‌పై రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది. కిట్టి పార్టీల పేరుతో అమాయకులను మోసం చేసి శిల్పా చౌదరి కోట్లు కొల్లగొట్టింది. శిల్పా చౌదరిని ఇటీవల అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు నార్సింగ్ పోలీసులు తరలించారు. శిల్పా చౌదరి అరెస్ట్‌తో బాధితులు తరలి వస్తున్నారు. శిల్పా చౌదరి ఆమె భర్తను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు కోర్టును కోరనున్నారు. మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని శిల్పా చౌదరి తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. నేడు బెయిల్, కస్టడీ పిటీషన్‌పై ఉప్పరపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.

Updated Date - 2021-12-02T16:09:20+05:30 IST