కరోనా పేరుతో సైబర్ దాడులు
ABN , First Publish Date - 2020-06-27T05:30:00+05:30 IST
‘ప్రభుత్వం ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. మరిన్ని వివరాల కోసం..’ అంటూ మీకు మెయిల్ వచ్చిందా? అయితే పొరపాటున కూడా ఆ మెయిల్ను ఓపెన్ చేయకండి...
‘ప్రభుత్వం ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. మరిన్ని వివరాల కోసం..’ అంటూ మీకు మెయిల్ వచ్చిందా? అయితే పొరపాటున కూడా ఆ మెయిల్ను ఓపెన్ చేయకండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు పంపిన ఫిషింగ్ మెయిల్ అది. ఒకవేళ మీరు ఆ వివరాలు తెలుసుకోవాలనే ఆతృతలో ఆ మెయిల్ ఓపెన్ చేస్తే, మీ ఇన్బాక్స్లో ఉన్న డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కరోనా భయం పొంచి ఉన్న ఈ సమయంలో పెద్ద సంఖ్యలో సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ హెచ్చరిస్తోంది. ncov2019@gov.in పేరుతో వచ్చే మెయిల్స్ను ఓపెన్ చేయవద్దని సూచిస్తోంది. ‘ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో ప్రభుత్వం ఉచితంగా కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తోంది’ అంటూ వచ్చే కొన్ని మెయిల్స్తో సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ పేరుతో వచ్చే మెయిల్స్ను క్లిక్ చేయవద్దు. సైబర్ దాడుల బారిన పడకుండా యాంటీ వైరస్ టూల్స్ ఉపయోగించాలి. అపరిచితుల నుంచి వచ్చే మెయిల్స్, లింకులపై క్లిక్ చేయకూడదు. క్యాష్బ్యాక్ ఆఫర్లు, రివార్డులు, బహుమతుల పేరుతో వచ్చే మెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.