బైక్ ఢీకొని సైక్లిస్టు మృతి
ABN , First Publish Date - 2021-01-16T05:52:01+05:30 IST
బైక్ ఢీకొని సైక్లిస్టు మృతి చెందిన ఘటన మెదక్ మండలం ఖాజిపల్లి శివారులో గురువారం రాత్రి జరిగింది.
మెదక్ రూరల్, జనవరి 15: బైక్ ఢీకొని సైక్లిస్టు మృతి చెందిన ఘటన మెదక్ మండలం ఖాజిపల్లి శివారులో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు కథనం మేరకు.. మండలంలోని గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన చింతల నర్సింహులు(65) ఖాజిపల్లిలో ఉంటున్న కుమార్తె ఇంటికి సైకిల్పై బయలు దేరాడు. ప్రధాన రోడ్డుపై నుంచి ఖాజిపల్లి గ్రామం లోకి వెళ్లే క్రమంలో సైకిల్ను కుడివైపు టర్న్ తీసుకోగా చిన్నశంకరంపేట వైపు నుంచి వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్పై నుంచి కింద పడిన నర్సింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు తెలిపారు. ఈ మేరకు మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.