మరుగుజ్జు ఏనుగుల దేశం సైప్రస్!
ABN , First Publish Date - 2020-09-20T05:30:00+05:30 IST
అక్కడ ట్యాక్సీ డ్రైవర్లు చిల్లర మిగిలితే తిరిగి ఇవ్వకుండా టిప్గా ఉంచేసుకుంటారు. చుట్టూ నీళ్లు ఉన్నా చేపలు పట్టడం అక్కడి వారికి ఇష్టం ఉండదు. అందుకే చేపలు కూడా తినరు. ఒకప్పుడు అక్కడ మరుగుజ్జు ఏనుగులు ఉండేవి. యూరప్లో ఉన్న అందమైన ద్వీపం సైప్రస్ కబుర్లు ఇవి...
అక్కడ ట్యాక్సీ డ్రైవర్లు చిల్లర మిగిలితే తిరిగి ఇవ్వకుండా టిప్గా ఉంచేసుకుంటారు. చుట్టూ నీళ్లు ఉన్నా చేపలు పట్టడం అక్కడి వారికి ఇష్టం ఉండదు. అందుకే చేపలు కూడా తినరు. ఒకప్పుడు అక్కడ మరుగుజ్జు ఏనుగులు ఉండేవి. యూరప్లో ఉన్న అందమైన ద్వీపం సైప్రస్ కబుర్లు ఇవి...
- డెన్మార్క్, స్వీడన్ తరువాత విద్యారంగంపై ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశం ఇది. జీడీపీలో 7 శాతం ఎడ్యుకేషన్ రంగానికి వెచ్చిస్తోంది.
- ఏటా ఇక్కడ లిమాసోల్ కార్నివాల్ ఫెస్టివల్ను నిర్వహిస్తారు. గత వందేళ్లుగా ఈ కార్నివాల్ను సైప్రస్లో జరుపుతున్నారు. దేశవిదేశాల నుంచి ఈ కార్నివాల్ చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.
- సైప్రస్ రాజధాని నికోసియా. టర్కిష్, గ్రీక్ భాషలు మాట్లాడతారు.
- ఇక్కడి ప్రజలు భోజనప్రియులు. వారంలో ఒకరోజు తప్పనిసరిగా రెస్టారెంట్లలో తమకిష్టమైన ఫుడ్ను తినడానికి ఇష్టపడతారు.
- ప్రపంచంలో అతి పురాతనమైన నీటి బావులను ఈ ద్వీపంలో గుర్తించారు. అవి 10 వేల ఏళ్ల క్రితం నాటివని అంచనా. ఈ ద్వీపంలో మరుగుజ్జు ఏనుగులు ఉండేవి. క్రీ.పూ 11 వేల ఏళ్ల నాటి ఒక మరుగుజ్జు ఏనుగు అవశేషాలు ఇక్కడ లభించాయి. ఆ ఏనుగు ఎత్తు 40 అంగుళాలు.