కాంగ్రెస్లో డీఎస్ చేరిక మళ్లీ వాయిదా
ABN , First Publish Date - 2022-01-23T23:10:01+05:30 IST
కాంగ్రెస్లో డీఎస్ చేరిక మళ్లీ వాయిదా పడింది. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన ఆయన కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకున్నారు...
హైదరాబాద్: కాంగ్రెస్లో డీఎస్ చేరిక మళ్లీ వాయిదా పడింది. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన ఆయన కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో డీఎస్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత డీఎస్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన చేరిక వాయిదా పడినట్లు ప్రకటన వెలువడింది.