నిత్యం సాయంత్రం ‘స్పందన’ నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-10-27T04:39:12+05:30 IST
సచివాలయాల్లో ప్రతిరోజూ సాయంత్ర 4 నుంచి 5 గంటల వరకు తప్పని సరిగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) గణేష్కుమార్ ఆదేశించారు.
జేసీ గణేష్కుమార్
సూళ్లూరుపేట, అక్టోబరు 26 : సచివాలయాల్లో ప్రతిరోజూ సాయంత్ర 4 నుంచి 5 గంటల వరకు తప్పని సరిగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) గణేష్కుమార్ ఆదేశించారు. మండలంలోని కేసిఎన్గుంట, ఆబాక, కోటపోలూరు, మంగానెల్లూరు సచివాలయాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులు అందరూ ప్రతి రోజు సాయంత్రం స్పందనలో పాల్గొనాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో నర్మద పాల్గొన్నారు.