ఆ భూములను దళితులకు ఇవ్వాలి: దళిత సంఘాలు

ABN , First Publish Date - 2021-11-18T01:05:53+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకుల ఆధీనంలోని ప్రభుత్వ భూమిని

ఆ భూములను దళితులకు ఇవ్వాలి: దళిత సంఘాలు

మెదక్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకుల ఆధీనంలోని ప్రభుత్వ భూమిని దళితులకు ఇవ్వాలని దళిత సంఘాల డిమాండ్ చేశాయి. అచ్చంపేటలో జమునా హెచరీస్ ముందు దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ ఆందోళనకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. దళితులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు. హామీతో దళితులు తమ ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఈటల కంపెనీ వల్ల నిరుపేద రైతులు నష్టపోయారన్నారు. అసైన్డ్ భూములను తిరిగి ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. కలెక్టర్ త్వరగా అసైన్డ్ భూములను పేదలకు తిరిగి త్వరగా ఇవ్వాలన్నారు.  



Updated Date - 2021-11-18T01:05:53+05:30 IST