యూపీలో దారుణం.. దళిత రైతు తల నరికివేత

ABN , First Publish Date - 2020-09-23T23:46:49+05:30 IST

పొలానికి నీళ్లు వదలడానికి నిరాకరించినందుకు ఓ దళిత రైతుని చితకబాది చివరికి తల నరికేశారు...

యూపీలో దారుణం.. దళిత రైతు తల నరికివేత

పొలానికి నీళ్లు వదలడానికి నిరాకరించినందుకు ఓ దళిత రైతుని చితకబాది చివరికి తల నరికేశారు. ఈ దారుణం యూపీలోని షేక్‌పూర్ గ్రామంలో సోమవారం జరిగింది. మృతుడి కుమారుడు చెప్పిన కథనం ప్రకారం సోమవారం రాత్రి పొలంలో మృతుడు తన కుమారుడితో పనులు చేసుకుంటున్నాడు. కుమారుడిని ఇంటికి వెళ్లి భోజనం సిద్ధంగా ఉంచమని తండ్రి చెప్పగా అతను వెళ్లి పోయాడు. ఉదయం వరకు తండ్రి రాకపోవడంతో, అతను పొలం వైపు వెళ్లగా తండ్రి శవం కనిపించదని చెప్పాడు.


పక్క పొలం రైతు తన పొలానికి నీళ్లు వదలమని అడిగాడని కానీ మృతుడు నిరాకరించడంతో అతడిని చితకబాదాడని గ్రామస్తులు సాక్ష్యం చెప్పారు. తాము అడ్డుకోబోతే అడ్డొచ్చిన వారిని చంపుతానని నిందితుడు బెదిరించాడని వారు చెప్పారు.


పరారీలో ఉన్న నిందుతుడిని అరెస్టు చేసి అతనిపై హత్యా నేరంతోపాటు దళిత అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసలు తెలిపారు.

Updated Date - 2020-09-23T23:46:49+05:30 IST