‘దళితబంధు’ను రాష్ట్రమంతా అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-07-30T06:01:40+05:30 IST

దళితబంధు పథకాన్ని ప్రభు త్వం రాష్ట్రం మొత్తం అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్కలపల్లి రాములు అన్నారు.

‘దళితబంధు’ను రాష్ట్రమంతా అమలు చేయాలి
మద్దిరాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న రాములు

మద్దిరాల/ గరిడేపల్లి జూలై 29: దళితబంధు పథకాన్ని ప్రభు త్వం రాష్ట్రం మొత్తం అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్కలపల్లి రాములు అన్నారు. మండల పరిధిలోని జి కొత్తపల్లిలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. హు జూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం అక్కడ పైలట్‌ ప్రాజెక్ట్‌గా దళిత బంధును అమలు చేయడం ఓట్లకోసమేనన్నారు. పేదలకు సీపీఎం అండగా ఉంటుందన్నారు. అనంతరం గ్రామ శాఖను ఎన్నుకు న్నా రు. కార్యక్రమంలో నాయకులు కందాల శంకర్‌రెడ్డి, పులుసు సత్యం, కె. భాస్కర్‌, రామ్ముర్తి ఉన్నారు. గిరిడేపల్లిలో జరిగిన జరి గిన సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా కార్యదర్శి మంద భిక్షం మా ట్లాడారు. హూజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలవాలనే లక్ష్యంతో ఆ నియోజకవర్గానికే దళితబంధు ప్రకటించడం సరికాదన్నారు. కార్య క్రమంలో సంఘం నాయకులు పిట్ట పిచ్చయ్య, నకిరేకంటి వెంక టయ్య, సైదులు, కాంతయ్య, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T06:01:40+05:30 IST